: నోట్ల రద్దుతో బ్యాంకింగ్ వ్యవస్థను సర్వనాశనం చేశారు: మమతా బెనర్జీ

ప్రధానిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు. నోట్ల రద్దుతో బ్యాంకింగ్ వ్యవస్థను సర్వనాశనం చేశారని ఆమె ఆవేశంతో అన్నారు. నోట్ల రద్దుపై ప్రతిపక్షాలు నిర్వహించిన సమావేశంలో 8 పార్టీలు పాల్గొన్నాయి. రాహుల్ పిలుపు మేరకు ఈ సమావేశానికి మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై విమర్శల వర్షం గుప్పించారు. మమతా బెనర్జీ మాట్లాడుతూ, నోట్ల రద్దు అతిపెద్ద కుంభకోణమని, మోదీ ప్రకటించిన 50 రోజుల గడువు పూర్తయినా దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనలేదని అన్నారు. 

More Telugu News