: రివ్యూలు ప్రతికూలంగా రాస్తున్నారంటూ కంటతడిపెట్టిన హాస్యనటుడు సప్తగిరి

తామంతా ఎంతో కష్టపడి సినిమా బాగా తీస్తే రివ్యూలు మాత్రం ప్రతికూలంగా రాశారంటూ ప్రముఖ హాస్యనటుడు సప్తగిరి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ చిత్రం గత వారం విడుదలై విజయవంతంగా నడుస్తున్న నేపథ్యంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ, హీరోగా తాను చేసిన తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. దర్శకుడిని కావాలన్న లక్ష్యంతో సినిమాల్లోకి వచ్చిన తాను, నటుడిని అయ్యానని, ఎప్పటికైనా దర్శకత్వం చేస్తానని అన్నాడు. కాగా, ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ చిత్రానికి దర్శకుడు అరుణ్ పవార్ కాగా, నిర్మాత రవికిరణ్.   

More Telugu News