: ఢిల్లీ విమానాశ్రయంలో ఢీ కొట్టుకున్న విమానాలు.. తప్పిన ముప్పు!

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో స్పైస్ జెట్, ఇండిగో ఎయిర్ వేస్ కు చెందిన విమానాలు పరస్పరం ఢీ కొట్టుకున్నాయి. విమానాలు రెండూ నెమ్మదిగా రన్ వేపైకి వెళ్తున్న సమయంలో చోటుచేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఏమీ కాలేదని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

More Telugu News