: సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న సుబ్రహ్మణ్యస్వామి

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ నుంచి దస్త్రాలు కోరుతూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిటిషన్‌ ను పటియాలా కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. పటియాలా కోర్టు నిర్ణయం వెలువరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీ నేషనల్ హెరాల్డ్‌ పత్రిక నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆయన తెలిపారు. 

More Telugu News