tamota rate falls: ఏకంగా 70 ట్ర‌క్కుల ట‌మోటాను పారబోసిన రైతులు... వాటిపై నుంచే వెళ్లిన వాహనాలు

దేశ వ్యాప్తంగా ట‌మోటా ధ‌ర‌ దారుణంగా ప‌డిపోవడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మార్కెట్‌కు తీసుకొస్తున్న ట‌మోటాల‌కు స‌రైన ధర దొర‌క‌క‌పోతుండ‌డంతో రైతులు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. మార్కెట్ లో కిలో ట‌మోటాలను ఒక్క రూపాయకే తీసుకుంటామని రైతులకు వ్యాపారులు చెబుతుండడంతో ఆగ్ర‌హానికి గుర‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే త‌గ్గిన ట‌మోటా ధ‌ర‌ల‌కు నిర‌స‌న‌గా చ‌త్తీస్‌గ‌ఢ్‌లోని దుర్గ్ న‌గ‌రంలో ఈ రోజు రైతులు నిర‌స‌న తెలిపారు. ఏకంగా 70 ట్ర‌క్కుల టమోటాల‌ను రోడ్డుపై పార‌పోశారు. రోడ్డుపై ప‌డి ఉన్న ఆ ట‌మోటాల మీదుగానే వాహ‌నాలు వెళ్లాయి. అప్పుచేసి నెల‌ల త‌ర‌బ‌డి క‌ష్ట‌ప‌డి పండించిన ట‌మోటాలకు మ‌ద్ద‌తు క‌నీస మ‌ద్ద‌తుధ‌ర కూడా దొర‌క‌కుండా పోతుండ‌డంతో రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.  

More Telugu News