rajnath singh: ఎటువంటి స‌మ‌స్య‌నైనా ఎదుర్కొనేందుకు మేము సిద్ధం: పెద్దనోట్ల ర‌ద్దుపై రాజ్‌నాథ్‌ సింగ్

పెద్ద‌నోట్ల రద్దు నేప‌థ్యంలో వ‌చ్చే ఎటువంటి స‌మ‌స్య‌నైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ఈ రోజు అస్సాంలోని గౌహ‌తిలో జ‌రిగిన బీజేపీ పార్టీ ఎగ్జిక్యూటివ్ స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగిస్తూ... కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యానికి దేశ ప్ర‌జ‌లంతా మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌ని పేర్కొన్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ దేశంలోని న‌ల్ల‌ధ‌నాన్ని నిరోధించాల‌నే మంచి ఉద్దేశంతో ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నార‌ని ఆయ‌న చెప్పారు. తాము అధికారం కోసం కాకుండా స‌మాజ సేవ కోసమే రాజ‌కీయాలు చేస్తామ‌ని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న బంగ్లాదేశ్‌ను కొనియాడారు. భార‌త్‌కు బంగ్లాదేశ్‌ ప్ర‌తి అంశంలోనూ అండ‌గా నిలుస్తుంద‌ని పేర్కొన్నారు.

More Telugu News