: బెంగళూరులో కొత్త నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇద్దరి అరెస్ట్
దేశంలో పెద్దనోట్ల రద్దు అనంతరం అక్రమార్కులు చేస్తోన్న లావాదేవీలను అడ్డుకునేందుకు అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఎంతో మంది పట్టుబడుతున్నప్పటికీ అక్రమార్కులు తమ పని తాము చేసుకుంటూ వెళుతున్నారు. తమ వద్ద ఉన్న పాతనోట్లను దళారుల సాయంతో మార్చుకుంటున్నారు. ఈ రోజు బెంగళూరులో దాడులు నిర్వహించిన పోలీసులకు రూ.11.30 లక్షలు విలువచేసే కొత్త కరెన్సీ నోట్లు పట్టుబడ్డాయి. అవన్నీ కొత్త 2000 రూపాయల నోట్లే. ఈ నోట్లను మార్చిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని, వారిని ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించారు.