infants: అప్పుడే పుట్టిన కవల శిశువుల్ని పొదల్లో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు

తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు అమాన‌వీయ ఘ‌ట‌న చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన కవల శిశువుల్ని జిల్లాలోని తుని మార్కెట్‌ యార్డు వ‌ద్ద ఉన్న పొద‌ల్లో గుర్తుతెలియ‌ని వ్యక్తులు పడేసి వెళ్లారు. ఆ పొద‌ల నుంచి వ‌స్తోన్న‌ ఆ శిశువుల ఏడుపు విన్న అక్క‌డి స్థానికులు శిశువుల‌ను ర‌క్షించి, తుని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆసుప‌త్రిలో ఆ శిశువుల‌కి వైద్యులు అత్యవసర చికిత్స అందజేస్తున్నారు.

More Telugu News