: కోహ్లీ బ్రాండే కానీ సచినే గ్రేటు!: బైచుంగ్ భూటియా

భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారత ఫుట్ బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ అద్భుతమైన, అనితర సాధ్యమైన ఆటతీరుతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నప్పటికీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో పోల్చే స్థాయికి ఇంకా చేరలేదని అన్నాడు. ఈ మధ్య కాలంలో విరాట్ సాధించిన ఘనతలతో తను ఒక బ్రాండ్గా మారాడని భూటియా అభిప్రాయపడ్డాడు. తన సమకాలీన క్రికెటర్లలో విరాట్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడని ఆయన అన్నాడు. దీంతో కోహ్లీ పేరే ఒక బ్రాండ్ గా మారిపోయిందని అన్నాడు. అయితే సచిన్ టెండూల్కర్ తో విరాట్ ను పోల్చడం సరికాదని హితవు పలికాడు. 'సచిన్ సాధించిన ఘనతలు అసాధారణం. సచిన్ చాలా మైలురాళ్లను సృష్టించిన దిగ్గజ క్రికెటర్' అని పొగిడాడు. వారిద్దరినీ వేరుగా చూడాలని, కోహ్లీ సచిన్ తో పోల్చదగిన స్థాయికి ఇంకా చేరలేదని బైచుంగ్ భూటియా అభిప్రాయపడ్డాడు. 

More Telugu News