dowry: వరకట్నం కోసం అత్తింటి వారిపై అల్లుడి దాడి... మామ మృతి

వరకట్నం కోసం ఓ వ్య‌క్తి అత్తింటివారిపై కత్తితో దాడి చేసిన ఘ‌ట‌న జ‌గిత్యాల జిల్లా కదలాపూర్ మండలం, ధూంపేటలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో నిందితుడి మామయ్య భూమయ్య అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా, అత్త, నిందితుడి భార్య‌ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. వారిరువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

More Telugu News