: వాళ్లకు లేఖలు రాస్తే స్పందిస్తారు కానీ, జీహెచ్ఎంసీ మాత్రం స్పందించదు!: కిషన్ రెడ్డి

ప్రధాన మంత్రికి, ముఖ్యమంత్రికి లేఖ రాస్తే వెంటనే సమాధానం వస్తోంది కానీ, జీహెచ్ఎంసీకి లేఖ రాస్తే మాత్రం ఎటువంటి స్పందన రావడం లేదని బీజేపీ నేత కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రజాసమస్యలపై జీహెచ్ఎంసీ అధికారుల నుంచి స్పందన కరవైందన్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడిందని, నగర అభివృద్ధిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు పాడైతే అరకొర నిధులతో మరమ్మతులు చేశారని అన్నారు. బస్ బే కు సంబంధించి జీహెచ్ఎంసీ, ఆర్టీసీ మధ్య సమన్వయం లోపించిందని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

More Telugu News