: ఒకే వేదికపై ముఖ్యమంత్రి, కొడుకు, మనవడు!

విజయవాడలో జరుగుతున్న సిలికానాంధ్ర అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం ముగింపు కార్యక్రమం ప్రారంభమైంది. 18 దేశాలకు చెందిన సుమారు ఏడు వేల మంది కళాకారులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు.  సీఎం చంద్రబాబుతో పాటు తనయుడు నారా లోకేశ్, మనవడు దేవాన్ష్ లు కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా, గిన్నిస్ రికార్డే లక్ష్యంగా ఏర్పాటు చేసిన కూచిపూడి నాట్య సమ్మేళనంలో ఏపీ మంత్రులు, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్, కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దె అనురాధ తదితరులు పాల్గొన్నారు.

More Telugu News