: రాంగోపాల్ వర్మకు పిచ్చిపట్టింది: విరుచుకుపడ్డ సీపీఐ

దర్శకుడు రాంగోపాల్ వర్మకు మతిభ్రమించి 'వంగవీటి' చిత్రం తీశాడని విజయవాడ సీపీఐ నేతలు మండిపడ్డారు. ప్రజల కోసం ఎంతో పోరాడి హత్యకు గురైన చలసాని వెంకటరత్నం పాత్రను ఈ చిత్రంలో తప్పుగా చూపారని ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన సీపీఐ నేత దోనేపూడి శంకర్ ఆరోపించారు. వెంకటరత్నాన్ని మద్యానికి బానిసైన వ్యక్తిగా చూపారని, ఆయన్ను కించపరిచేలా చిత్రం ఉందని అన్నారు. చిత్రంపై తమకు అభ్యంతరాలున్నాయని, వాటిని తొలగించకుంటే, వర్మకు బుద్ధి చెబుతామని శంకర్ హెచ్చరించారు. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు.

More Telugu News