: నేను ఈ సినిమా కోసం బస్తాలు మోయలేదు.. కాళ్లరిగేలా తిరగలేదు: రాంగోపాల్ వర్మ

'వంగవీటి' జీవిత కథపై పరిశోధన చేసేందుకు తాను బస్తాలు మోయలేదని, కాళ్లరిగేలా వివిధ ప్రదేశాలు కూడా తిరగలేదని ఆ సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపాడు. ఏసీ రూంలో కూర్చుని, ఆ రోజులతో పరిచయం ఉన్న వ్యక్తులకు ఫోన్ చేసి, వివరాలు కనుక్కొని, అందులోంచి స్క్రిప్టు తయారు చేశానని అన్నాడు. ఆ నాటి సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు అక్కడ తాను లేనని, ఆ సంఘటనలు తెలిసిన వారినుంచి తెలుసుకున్న సమాచారం నుంచి కథను తయారు చేసి, వారి ఎమోషన్ ను సినిమాగా తీశానని వర్మ తెలిపాడు. ఒకరికి నచ్చేలా తీయడానికి తన వద్ద కారణాలు లేవని వర్మ స్పష్టం చేశాడు. రత్నకుమారి అభ్యంతరం చెప్పిన సన్నివేశాన్ని తీసేస్తానని వర్మ తెలిపాడు. ఎలాంటి సినిమా తీయాలి? అన్నది తన పూర్తి వ్యక్తిగత నిర్ణయమని వర్మ చెప్పాడు.

More Telugu News