: ఆ సన్నివేశాలను తొలగించకపోతే అడ్డుకుంటాం: వర్మపై వంగవీటి అభిమానుల సంఘం ఫిర్యాదు

విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ప‌లు ఘ‌ట‌న‌ల ఆధారంగా సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన 'వంగ‌వీటి' సినిమాలోని ప‌లు సీన్ల‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ వంగవీటి అభిమానుల సంఘం ఈ రోజు హైద‌రాబాద్‌లో మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ సినిమాలో ఓ వర్గాన్ని రౌడీ షీటర్లుగా చిత్రీకరించారని వారు ఆరోపిస్తున్నారు. వర్మపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వెంట‌నే ఆ సినిమాలోని అభ్యంత‌ర‌క‌ర దృశ్యాల‌ను తొలగించకపోతే వంగ‌వీటి సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని వంగవీటి అభిమానుల సంఘం స‌భ్యులు హెచ్చరించారు. వారు చేసిన ఈ ఫిర్యాదుపై మానవ హక్కుల సంఘం స్పందిస్తూ.. వ‌చ్చేనెల 16 లోగా త‌మ‌కు నివేదిక అంద‌జేయాల‌ని సెన్సార్‌ బోర్డుకు సూచించింది.

More Telugu News