accident: తిరుప‌తిలో వ్యాను బీభ‌త్సం... ఇద్ద‌రి మృతి.. న‌లుగురి ప‌రిస్థితి విష‌మం

తిరుప‌తిలోని కొర్ల‌గుంట కూడ‌లిలో ఈ రోజు ఉద‌యం ఓ వ్యాను బీభ‌త్సం సృష్టించింది. ఆ మార్గం గుండా వేగంగా వెళుతున్న వ్యాను బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఒక్క‌సారిగా రోడ్డుప‌క్క‌న ఉన్న‌ జ‌నాల‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు పాద‌చారులు మృతి చెందారు. మ‌రో న‌లుగురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఒక‌రు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయార‌ని, మ‌రొకరు తిరుప‌తిలోని రుయా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందార‌ని పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో గాయాల‌పాల‌యిన మ‌రో న‌లుగురికి చికిత్స అందిస్తున్న‌ట్లు, వారి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు చెప్పారు.

More Telugu News