crime: మహిళా పోలీసు కానిస్టేబుల్పై యాసిడ్ చల్లి పారిపోయిన దుండగులు

ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్పై దుండగులు యాసిడ్ దాడి చేసిన ఘటన తమిళనాడులోని వెల్లూరు జిల్లా తిరుప్పతూర్లో కలకలం రేపింది. నాన్ని రాత్రి తన డ్యూటీ ముగించుకున్న లావణ్య అనే పోలీసు కానిస్టేబుల్ ఇంటికి వెళుతోంది. అయితే, అదే సమయంలో ఆమె వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ కొందరు దుండగులు ఆమెపై యాసిడ్ చ‌ల్లి ప‌రార‌య్యారు. ప్ర‌స్తుతం లావ‌ణ్య  వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. యాసిడ్ దాడిలో ఆమె ముఖం, చేతులు తీవ్రంగా గాయపడ్డాయి. ఆమెపై దాడి చేసిన‌ నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. లావణ్యకు తన భర్తతో విభేదాలు రావ‌డంతో ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి కొంత‌కాలంగా తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది.

More Telugu News