child died: స్కూల్లో విషాదం... సాంబారు పాత్రలో పడి ప్రాణాలు కోల్పోయిన‌ చిన్నారి

న‌ల్గొండ జిల్లా కట్టంగూరులోని ఈదులూరు ప్రాథ‌మిక‌ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్లో సాంబారు పాత్రలో ప‌డి ఐదేళ్ల ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈదులూరుకు చెందిన బల్కూరి జయవర్థన్ స‌ద‌రు పాఠశాలలో ఒకటవ తరగతి విద్యార్థి. స్కూల్లో నిన్న‌ మధ్యాహ్న భోజనం పెడుతున్న స‌మ‌యంలో త‌న తోటి విద్యార్థుల‌తో క‌లిసి లైన్‌లో నిల్చున్నాడు. అయితే వెనుక‌నుంచి తోటి విద్యార్థులు నెట్ట‌డంతో ఒక్క‌సారిగా సాంబారు పాత్రలో ప‌డ్డాడు. దీంతో ఆ చిన్నారి తల కింది భాగం పూర్తిగా కాలిపోయింది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన ఉపాధ్యాయులు వెంట‌నే జ‌య‌వ‌ర్థ‌న్‌ను నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్క‌డి డాక్ట‌ర్లు హైదరాబాద్‌ ఉస్మానియాకు తరలించారు. ఉస్మానియాలో చికిత్స తీసుకుంటూ ఈ రోజు ఉద‌యం ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.

More Telugu News