: నాకు సిగ్గు ఎక్కువ.. నటిని అవుతానని అనుకోలేదు: దిశా పటానీ

తనకు సిగ్గు ఎక్కువని, కెమెరా ముందు నటిస్తానని తానెప్పుడూ అనుకోలేదని నటి దిశా పటానీ చెప్పింది.  ‘లోఫర్’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు, ‘ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ తో బాలీవుడ్ కు పరిచయమైన దిశా పటానీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి తనకు సిగ్గు ఎక్కువ అని,  తాను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే దానిని కాదని.. అందుకే, తనకు పెద్దగా స్నేహితులు కూడా లేరని చెప్పింది. విధి రాత ప్రకారమే తాను నటిని అయ్యానని తన మనసులో మాట చెప్పిన దిశా పటానీ, నటిగా మంచి అవకాశాలు రావడం వల్లే తనకు గుర్తింపు వచ్చిందని చెప్పింది. కాగా, అంతర్జాతీయ నటుడు జాకీ చాన్ తో కలిసి ‘కుంగ్ ఫూ యోగా’ అనే ఇండో చైనీస్ చిత్రంలో దిశా నటిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 28న ఈ చిత్రం విడుదల కానుంది.
 

More Telugu News