: కావేరి ఆసుపత్రి నుంచి కరుణా నిధి డిశ్చార్జి.. ఊరేగింపుగా తీసుకువెళుతున్న కార్యకర్తలు!

డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం మెరుగుపడటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఈ విషయాన్నిడీఎంకే నేతలు, ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా, తమ అధినేత ఆరోగ్యం మెరుగుపడి, ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావడంతో  డీఎంకే పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కరుణానిధిని ఊరేగింపుగా ఆయన నివాసానికి తీసుకువెళ్తున్నారు. కాగా, అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల క్రితం చెన్నైలోని కావేరి ఆసుపత్రి లో కరుణానిధి చేరారు.



More Telugu News