somi reddy: అవన్నీ అవాస్తవాలే.. నాకు విదేశాల్లో అక్రమాస్తులు లేవు: ఎమ్మెల్సీ సోమిరెడ్డి

టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి విదేశాల్లో రూ.500 కోట్ల‌కు పైగా న‌ల్ల‌ధ‌నం దాచార‌ని నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి ఆరోపణ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. కాకాని చేసిన ఈ ఆరోప‌ణ‌ల‌పై సోమిరెడ్డి స్పందించారు. వైసీపీ నేతలు త‌న‌పై చేస్తోన్న ఆరోపణలు అవాస్తవమని, తనపై వారు చేస్తున్న ఆరోపణలు రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత జగన్‌, ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌ల‌కే పెద్ద ఎత్తున అక్రమాస్తులు ఉన్నాయని ఆరోపించారు. తాను స‌ర్కారు త‌ర‌ఫునే విదేశాలకు వెళ్లాన‌ని, అంతేగాని త‌న‌ వ్యక్తిగత పనుల కోసం వెళ్లలేదని అన్నారు.

More Telugu News