demonitisation: డ్యామ్‌లో పెద్ద ఎత్తున రూ.500, 1000 నోట్ల‌ను పారేసిన న‌ల్ల‌కుబేరులు!

తమ వద్ద వున్న డ‌బ్బును ఏదో ఒక రకంగా మార్చుకుందాంలే అనే ఆలోచ‌న‌తో ఉన్న న‌ల్ల‌కుబేరులు ఇప్పుడు పోలీసులు చేస్తోన్న దాడుల‌కు భ‌య‌ప‌డిపోతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం అటువంటి వారిపై నిఘా ఉంచి, అరెస్టులు చేస్తుండ‌డం, మ‌రికొన్ని రోజుల్లో బ్యాంకుల్లో పెద్ద‌నోట్ల‌ని మార్చుకునే గ‌డువు ముగుస్తుండ‌డంతో త‌మ డ‌బ్బుని చించేసి, నీళ్లపాలు చేస్తున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కుక్రైల్ డ్యామ్‌లో నీటిలో ఈ రోజు పెద్ద ఎత్తున ర‌ద్ద‌యిన నోట్లు కొట్టుకువ‌చ్చాయి. దీనిని గ‌మ‌నించిన స్థానికులు వాటిని తీసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు డ్యామ్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. స‌ద‌రు డ్యామ్ వ‌ద్ద‌కు పెద్ద సంఖ్య‌లో స్థానికులు త‌ర‌లివ‌చ్చారు.

More Telugu News