: 255 రాజకీయ పార్టీలపై ఈసీ వేటు... ఇందులో 15 పార్టీలు తెలుగు రాష్ట్రాలవి

దేశ వ్యాప్తంగా నమోదైన 255 పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. కేవలం కాగితాలకే పరిమితమైన ఈ పార్టీల గుర్తింపును రద్దు చేసింది.  ఈ పార్టీలన్నీ 2005 నుంచి 2015 వరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. అంతేకాక, మనీలాండరింగ్ కార్యకలాపాల్లో కూడా ఈ పార్టీలు పాలుపంచుకున్నాయని ఈసీ భావించింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 15 పార్టీలు కూడా ఉన్నాయి. వీటిలో ఎన్టీఆర్ టీడీపీ, అన్నా టీడీపీ, జై తెలంగాణ వంటి పార్టీలు ఉన్నాయి.

మరోవైపు తాను డీలిస్ట్ చేసిన పార్టీల వివరాలను ఈసీ ఇప్పుడు ఐటీ శాఖకు పంపనుంది. ఈ రాజకీయ పార్టీల ఆర్థిక కార్యకలాపాలను పరిశీలించాలంటూ ఇప్పటికే ప్రత్యక్ష పన్నుల బోర్డుకు కూడా ఈసీ లేఖ రాసింది. లేఖ రాసిన రెండు రోజుల్లోపే ఈసీ సదరు పార్టీలపై వేటు వేయడం గమనార్హం. 

More Telugu News