accident: తీర్థయాత్రలో విషాదం.. బ‌స్సు బోల్తా.. చిన్నారి మృతి.. 20 మందికి గాయాలు

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి 60 మంది భవానీ భక్తులతో శ్రీశైలం వెళుతున్న బస్సు ఈ రోజు ఉద‌యం బోల్తా ప‌డింది. ఓ ప్రమాదకర మలుపు వద్ద బ‌స్సు అదుపు తప్పడంతో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. బ‌స్సులోని వారంతా తీర్థ‌యాత్ర‌ల్లో భాగంగా శ్రీశైలం మహా క్షేత్రానికి వెళుతున్నార‌ని ఈ ప్ర‌మాదంలో ఓ చిన్నారి మృతి చెందిందని పోలీసులు తెలిపారు. మ‌రో 20 మందికి పైగా భక్తులకు తీవ్ర‌గాయాల‌యిన‌ట్లు చెప్పారు. గాయాల‌పాల‌యిన యాత్రికుల‌ను శ్రీ‌శైలం దేవస్థానం ఆసుప‌త్రికి తరిలించి, చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

More Telugu News