demonitisation: విమానాశ్రయంలో విదేశీయుడి నుంచి 53.78 లక్షల రూపాయ‌ల కొత్తనోట్లు స్వాధీనం

భార‌త్‌లో పెద్దనోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో దేశంలోని ప‌లు విమానాశ్ర‌యాల్లో భారీగా న‌గ‌దు ప‌ట్టుబ‌డుతోంది.  ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టులో ఈ రోజు ఉద‌యం త‌నిఖీలు నిర్వ‌హిస్తోన్న అధికారులు ఓ విదేశీయుడి నుంచి భారీగా ఇండియ‌న్ క‌రెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అత‌డి నుంచి మొత్తం 58 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు. వాటిలో 53.78 లక్షల రూపాయ‌లు కొత్తనోట్లే ఉన్నాయ‌ని పేర్కొన్నారు. మిగ‌తా రూ.4.29 లక్షలు పాతనోట్లని పేర్కొన్నారు.  స‌ద‌రు ప్ర‌యాణికుడిని అదుపులోకి తీసుకుని ఆ డ‌బ్బుపై ఆరా తీస్తున్నామ‌ని చెప్పారు.

More Telugu News