: పార్టీ విధానాలకు అనుగుణంగానే గతంలో టీడీపీపై విమర్శలు చేశా: పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన

కృష్ణా జిల్లా పామర్రు వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన నేడు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేందుకే తాను టీడీపీలోకి చేరుతున్నట్టు తెలిపారు. ప్రతిపక్షంలో ఉంటే నిధుల కొరత ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో పామర్రు నియోజకవర్గాన్ని తొలి స్థానంలో నిలపడమే తన ఆకాంక్ష అని తెలిపారు. వైసీపీ పార్టీ విధానాలకు అనుగుణంగానే గతంలో టీడీపీపై విమర్శలు చేశానని... వ్యక్తిగతంగా ఎవరినీ కించపరిచే ఆలోచన తనకు లేదని చెప్పారు. ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతానని తెలిపారు. తనతో పాటు 30 మంది సర్పంచ్ లు, 20 మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, మరి కొందరు నేతలు టీడీపీలో చేరుతారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనకు ఎలాంటి బాధ్యతలను అప్పగించినా... నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. వైసీపీలో తనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని... ఎవరిపైనా తాను విమర్శలు చేయదలుచుకోలేదని అన్నారు.


More Telugu News