: ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. సికింద్రాబాద్‌-తిరుప‌తి, తిరుప‌తి-విశాఖ‌ప‌ట్ట‌ణం మ‌ధ్య 18 ప్ర‌త్యేక రైళ్లు

రైలు ప్ర‌యాణికుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే శుభ‌వార్త చెప్పింది. ర‌ద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్‌-విశాఖ‌ప‌ట్ట‌ణం, తిరుప‌తి-విశాఖ‌ప‌ట్ట‌ణం మ‌ధ్య 18 ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌ప‌నున్న‌ట్టు ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే ముఖ్య ప్ర‌జాసంబంధాల అధికారి ఎం.ఉమాశంక‌ర్ తెలిపారు.

ప్ర‌త్యేక రైళ్ల వివ‌రాలు ఇలా..
విశాఖ‌ప‌ట్ట‌ణం-సికింద్రాబాద్ వీక్లీ స్పెష‌ల్‌(08501):  విశాఖ‌ప‌ట్ట‌ణం నుంచి జ‌న‌వ‌రి 3, 10, 17, 24 తేదీల్లో రాత్రి 11 గంట‌ల‌కు బ‌య‌లుదేరి మ‌రుస‌టి రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

సికింద్రాబాద్‌-విశాఖ‌ప‌ట్ట‌ణం(08502): జ‌న‌వ‌రి 4, 11, 18, 25 తేదీల్లో సాయంత్రం నాలుగున్న‌ర గంట‌ల‌కు సికింద్రాబాద్‌లో బ‌య‌లుదేరి మ‌రుస‌టి రోజు ఉద‌యం 4:50 గంట‌ల‌కు విశాఖ‌ప‌ట్ట‌ణం చేరుకుంటుంది.

విశాఖ‌ప‌ట్ట‌ణం-తిరుప‌తి వీక్లీ స్పెష‌ల్‌(08573): విశాఖ‌ప‌ట్ట‌ణం నుంచి జ‌న‌వ‌రి 2, 9, 16, 23వ తేదీల్లో రాత్రి 10:55 గంట‌ల‌కు బ‌య‌లుదేరి మ‌రుస‌టి రోజు మ‌ధ్యాహ్నం 1:25 గంట‌ల‌కు తిరుప‌తి చేరుకుంటుంది.

తిరుప‌తి-విశాఖ‌ప‌ట్ట‌ణం(08574):  తిరుప‌తి నుంచి జ‌న‌వ‌రి 3, 10, 17, 24వ తేదీల్లో మ‌ధ్యాహ్నం  3:30 గంట‌ల‌కు బ‌య‌లుదేరి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6:50 గంట‌ల‌కు విశాఖ‌ప‌ట్ట‌ణం చేరుకుంటుంది.

More Telugu News