: కూతురు హత్య కేసులో నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియాకు కోర్టులో చుక్కెదురు

కన్న కూతురు షీనాబోరాను హత్య చేసిందన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జియాకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో చుక్కెదురైంది. తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గౌహతి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె వేసిన మధ్యంత బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. గౌహతికి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేమని... కావాలంటే పోలీసుల భద్రత మధ్య ముంబైలో అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని సూచించింది. అంతేకాదు, మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయరాదని షరతు విధించింది. 2012లో షీనాబోరాను హత్యచేసి, రాయఘడ్ అడవుల్లో పాతిపెట్టిన సంగతి తెలిసిందే. ఇదే కేసుకు సంబంధించి ఆమె మూడో భర్త పీటర్ ముఖర్జియా కూడా జైల్లో ఉన్నారు. 

More Telugu News