demonitization: ముంబయి నుంచి దుబాయ్‌కి త‌ర‌లిస్తున్న రూ.2 వేల నోట్లు స్వాధీనం

దేశంలోని ప‌లు ఎయిర్‌పోర్టుల్లో సోదాలు నిర్వ‌హిస్తోన్న అధికారులకు పెద్దనోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో భారీగా కొత్తనోట్లు ప‌ట్టుబ‌డుతున్నాయి. ద‌ళారులు, బ్యాంకు అధికారుల ద్వారా న‌ల్ల‌కుబేరులు ల‌క్ష‌ల‌కొద్దీ న‌గ‌దును మార్చుకుంటున్నారు. సామాన్యుడు ఒక్క రెండు వేల రూపాయ‌ల నోటు పొంద‌డానికి అష్ట‌క‌ష్టాలు ప‌డుతోంటే న‌ల్ల‌కుబేరులు మాత్రం త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన‌న్ని కొత్త నోట్ల‌ను పొందుతున్నారు. ఈ రోజు ఉద‌యం చెన్న‌య్ ఎయిర్‌పోర్టులో 1.34 కోట్ల రూపాయ‌లు స్వాధీనం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ముంబ‌యి ఎయిర్‌పోర్టులోనూ రూ.28 లక్షల విలువచేసే రూ.2000 నోట్ల‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రయాణికుడు ఈ డ‌బ్బుని ముంబయి నుంచి దుబాయ్‌కి త‌ర‌లిస్తుండ‌గా ప‌ట్టుకున్నామ‌ని అధికారులు తెలిపారు.

More Telugu News