demonitisation: ఐసీఐసీఐ బ్యాంకు వద్ద ఉద్రిక్తత‌... సీసీ కెమెరాలు, బ్యాంకు బోర్డు ధ్వంసం

పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో బ్యాంకుల ముందు నెల‌కొంటున్న ఉద్రిక్త ప‌రిస్థితులు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ రోజు అనంత‌పురంలోని ఉమాన‌గ‌ర్ ఓల్డ్ టౌన్ ఐసీఐసీఐ బ్యాంకు వ‌ద్ద తీవ్ర‌ ఉద్రిక్తత నెల‌కొంది. న‌గ‌దును స‌రిగా అందించ‌డం లేదంటూ బ్యాంకుపై సీపీఐ కార్య‌క‌ర్త‌లు దాడికి పాల్ప‌డ్డారు. బ్యాంకులోని సీసీ కెమెరాలు, బ్యాంకు బోర్డు ధ్వంసం చేసి ఆందోళ‌న చేశారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో పోలీసులు, సీపీఐ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య వాగ్వివాదం చెల‌రేగింది. దీనిపై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

More Telugu News