bank looty case: అది లష్కరే తోయిబా ఉగ్రవాదుల పనే.. పుల్వామాలో బ్యాంకు దోపిడీ కేసులో పురోగతి

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని ‘జ‌మ్ముక‌శ్మీర్ బ్యాంక్‌’ రాట్నిపారా బ్రాంచిలో వారం రోజుల క్రితం జరిగిన బ్యాంకు లూఠీ క‌ల‌క‌లం రేపిన సంగతి తెలిసిందే. ఓ బ్యాంకులోకి ప్ర‌వేశించిన‌ ఉగ్రవాదులు మొత్తం 11 ల‌క్ష‌ల రూపాయ‌లు చోరీ పారిపోయారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టిన అధికారులు ప‌లు ఆధారాలు సేక‌రించి కేసులో పురోగ‌తి సాధించారు. అక్క‌డ దొరికిన ప‌లు ఆధారాలు, సీసీ కెమెరాల దృశ్యాల‌ను ప‌రిశీలించిన అధికారులు బ్యాంకు దోపిడీకి పాల్ప‌డింది ల‌ష్క‌రే తోయిబాకు చెందిన ఉగ్ర‌వాదులేన‌ని నిర్ధారించారు. ఉగ్ర‌వాదుల కోసం గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

More Telugu News