suicide: వరంగల్ హైవే వద్ద చెట్టుకు ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య

వరంగల్ హైవే వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఓ విద్యార్థి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ‌డం అల‌జ‌డి రేపుతోంది. ఈ  విషయాన్ని గురించి సమాచారం  అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థలికి చేరుకున్నారు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న విద్యార్థి చైతన్య డిగ్రీ కాలేజీకి చెందిన కృష్ణారెడ్డిగా గుర్తించారు. కృష్ణారెడ్డి ఆత్మ‌హ‌త్య చేసుకునే ముందు నాణేలతో అక్కడ 'A' అక్షరాన్ని రాసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే, కృష్ణారెడ్డిని ఎవ‌ర‌యినా హత్య చేసి ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేశారా? అన్న అనుమానాన్ని కూడా పోలీసులు వ్య‌క్తం చేస్తున్నారు.

More Telugu News