demonitisation rides: త‌మిళ‌నాడులో మ‌రో ఐఏఎస్ ఇంట్లో ఐటీ దాడులు... భారీగా న‌గ‌దు, బంగారం స్వాధీనం

అక్ర‌మంగా డ‌బ్బు సంపాదించుకున్న ప్ర‌భుత్వ‌ అధికారుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తిస్తున్నారు ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు. త‌మిళ‌నాడులో ఈ రోజు మ‌రో ఐఏఎస్ అధికారి ఇంట్లో ఐటీ అధికారులు దాడులు నిర్వ‌హించారు. ఆ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ నాగ‌రాజ‌న్ ఇంట్లో ఈ రోజు ఉద‌యం నుంచి ఈ దాడులు కొన‌సాగుతున్నాయి. అతడి ఇంట్లో కూడా భారీగా న‌గ‌దు, బంగారం ఉన్న‌ట్లు స‌మాచారం అందుకున్న అధికారులు దాడులు చేసి ఇప్ప‌టివ‌ర‌కు రూ.1.50 కోట్లు, 6 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న‌ట్లు స‌మాచారం. త‌నిఖీలు ఇంకా కొన‌సాగుతున్నాయి. వ‌రుస దాడుల‌తో త‌మిళ‌నాడులో ప్ర‌భుత్వ అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. 

More Telugu News