pranab mukharji: రేపు హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపు హైద‌రాబాద్‌లోని బొల్లారంలో ఉన్న రాష్ట్ర‌ప‌తి నిల‌యానికి రానున్నారు. ఆయ‌న న‌గ‌రంలో ఈ నెల‌ 31 వరకు ఉంటారు. తన పర్య‌ట‌న‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వ‌హించ‌నున్న ప‌లు కార్య‌క్ర‌మాలకు హాజ‌ర‌వుతారు. ఎల్లుండి ఆయ‌న‌ ఆర్మీ కాలేజ్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌లో ఎండీఎస్‌, బీడీఎస్‌ల స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్ర‌సంగిస్తారు. అనంత‌రం ఎఫ్‌టీఏపీసీసీఐ సెంటినరీ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కి హాజ‌ర‌వుతారు. అనంత‌రం ఈ నెల 24న న‌గ‌రంలో మహిళా దక్షత సమితి, బన్సీలాల్‌ మలాని కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ లను ప్రారంభిస్తారు. ఆ త‌రువాతి రోజు బెంగళూరుకు బ‌య‌లుదేరుతారు. ఈ నెల 29న తిరువనంతపురంలో ప‌ర్య‌టించ‌నున్నారు.

More Telugu News