jc divakar reddy: మ‌మ్మ‌ల్ని అడ‌వుల పాలుజేశారు: తెలంగాణ మంత్రి ఈట‌ల‌తో అనంతపురం ఎంపీ

అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి ఈ రోజు ఉద‌యం తెలంగాణ అసెంబ్లీ ప్రాంగ‌ణంలో ప్రత్యక్షమైన సంగ‌తి తెలిసిందే. అక్క‌డి కాంగ్రెస్ ఆఫీసులోకి వెళ్లి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జానారెడ్డితో మాట్లాడిన దివాక‌ర్‌రెడ్డి అనంత‌రం తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌తోనూ ముచ్చ‌టించారు.

జానారెడ్డిని క‌లిసి వెళుతున్న స‌మ‌యంలో దివాక‌ర్‌రెడ్డికి అసెంబ్లీ లాబీలో ఈట‌ల రాజేంద‌ర్ ఎదురుప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా జేసీ దివాక‌ర్‌రెడ్డి త‌మ‌ని అడ‌వుల పాలుజేశారని ఈట‌ల‌తో అన్నారు. అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల‌కు తీవ్ర న‌ష్టం జ‌రిగిందని అన్నారు. ఆ రెండు జిల్లాలకు నీళ్లు స‌రిగా రావ‌డం లేద‌ని అన్నారు. అందుకు ఈట‌ల స్పందిస్తూ మీకు శ్రీ‌శైలం నుంచి నీరు వ‌స్తుంది క‌దా? అని అడిగారు.. అందుకు జేసీ స్పందిస్తూ సీఎంల ద‌య‌పై ఆధార‌ప‌డిన జిల్లాలు త‌మ‌వ‌ని అన్నారు.

More Telugu News