jc divakar reddy: తెలంగాణ‌ అసెంబ్లీ ప్రాంగ‌ణంలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి

అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి ఈ రోజు ఉద‌యం తెలంగాణ అసెంబ్లీ ప్రాంగ‌ణంలో ప్ర‌త్య‌క్షమ‌య్యారు. అక్క‌డ‌కు చేరుకున్న ఆయ‌న.. అక్క‌డి కాంగ్రెస్ ఆఫీసులోకి వెళ్లి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జానారెడ్డితో కాసేపు ముచ్చ‌టించారు. తెలంగాణ స‌ర్కారుపై కాంగ్రెస్ నేత‌లు సరిగా పోరాడడం లేదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. జానారెడ్డితో మాట్లాడుతూ పలు జోకులు పేల్చారు. రాయలసీమలోని రెండు జిల్లాలను కూడా తెలంగాణ రాష్ట్రంలో కలిపి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వ‌చ్చేద‌ని అన్నారు.

More Telugu News