: ‘పాక్’లో ‘దంగల్’ మూవీ విడుదల చేయట్లేదట !

ఈ నెల 23న బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ చిత్రం దేశ వ్యాప్తంగా విడుదల కానుంది. పొరుగు దేశమైన పాకిస్థాన్ లో కూడా ఈ చిత్రం విడుదల చేయనున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘దంగల్’ డిస్ట్రిబ్యూటర్ల అధికార ప్రతినిధి ఒక ప్రకటన చేశారు. పాకిస్థాన్ లో ‘దంగల్’ చిత్రాన్ని విడుదల చేయడం లేదని స్పష్టం చేశారు. ఇందుకు వ్యతిరేకంగా వస్తున్న వార్తలను నమ్మవద్దని ఈ సందర్భంగా కోరారు.

కాగా, జమ్మూకాశ్మీర్ లో యురీ సంఘటన అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాక్ లో భారతీయ చిత్రాల ప్రదర్శనను నిలిపివేశారు. దీంతో, 150 మిలియన్లు నష్టపోయామని, వంద మంది తమ ఉద్యోగాలు కోల్పోయారని  సంబంధిత అధికారి ఒకరు గతంలో ప్రకటించారు. తాజాగా, నిన్నటి నుంచి భారతీయ చిత్రాలను పాకిస్థాన్ థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. 

More Telugu News