cricket: చెన్నయ్ టెస్టు: రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌

చెన్న‌య్ వేదిక‌గా భారత్‌-ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌ల మ‌ధ్య‌ కొన‌సాగుతున్న చివరి టెస్టు మ్యాచులో చివరి రోజు ఆటలో ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయింది. మొద‌టి ఇన్నింగ్స్‌లో భార‌త్ 759 ప‌రుగుల భారీ స్కోరు చేయ‌డంతో ఇంగ్లండ్‌పై 282 పరుగుల ఆధిక్యాన్ని క‌న‌ప‌రిచిన విష‌యం తెలిసిందే. వికెట్‌ నష్టపోకుండా 12 పరుగుల ఓవ‌ర్ నైట్ స్కోరుతో ఈ రోజు బ్యాంటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ క్రీజులో వికెట్లు కాపాడుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ఆడుతోంది. ఓపెనర్లు కుక్‌, జెన్నింగ్స్‌లు ఆచితూచి ఆడుతూ స‌మ‌యం దొరికిన‌ప్పుడు ప‌రుగులు తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్రమంలో 49 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద కుక్ జ‌డేజా బౌలింగ్‌లో వికెట్ స‌మ‌ర్పించుకున్నాడు.

 అనంత‌రం కొద్దిసేప‌టికే జ‌డేజా బౌలింగ్ లోనే జెన్నింగ్స్ కూడా అవుటయ్యాడు. అర్ధ‌శ‌తకం సాధించిన జ‌న్నింగ్స్‌ 54 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద క్యాచ్ ఇచ్చుకొని వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం అలీ 1, రూట్ 1 వ్య‌క్తిగ‌త‌ స్కోరుతో క్రీజులో ఉన్నారు. మ్యాచును డ్రాగా ముగించేందుకు ఇంగ్లండ్‌ ప్రయత్నిస్తోంది. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ స్కోరు 110/2 (44 ఓవ‌ర్లకి)గా ఉంది.

More Telugu News