: తెలంగాణకు తక్షణం రూ.5 వేల కోట్లు పంపండి.. కేంద్రానికి మంత్రి హరీశ్‌రావు వినతి

తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న చిల్లర కష్టాలు తీర్చాలంటూ తెలంగాణ మంత్రి హరీశ్ రావు కేంద్రాన్ని కోరారు. నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించి 42 రోజులు గడిచినా ప్రజలు ఇంకా చిల్లర సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రానికి తక్షణం రూ. 5 వేల కోట్ల చిల్లర నోట్లు పంపాలని కేంద్రాన్ని కోరారు. కాగా పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు ఇంకా తెరపడలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ 80 శాతం ఏటీఎంలు తెరుచుకోలేదు. నోట్ల కష్టాలు తీరేందుకు మరో రెండు నెలలు పట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు.

More Telugu News