: శంషాబాద్ విమానాశ్రయంలో అరకిలో బంగారం పట్టివేత

శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేసిన అధికారులు అతడి నుంచి అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. అతడిని పూర్తిస్థాయిలో విచారించిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్టు అధికారులు తెలిపారు.

More Telugu News