: 24 గంటల్లో 20 లక్షల మంది వీక్షించారు...ధన్యవాదాలు: దేవీశ్రీప్రసాద్

మెగాస్టార్ హీరోగా నటిస్తున్న 'ఖైదీ నెంబర్ 150' చిత్రంలోని 'అమ్మడు లెట్స్ గో కుమ్ముడు' పాట 24 గంటల్లో 20 లక్షల వ్యూస్ సాధించిందని ఆ చిత్రబృందం ప్రకటించింది. ఆదివారం విడుదల చేసిన ఈ పాట అభిమానులను విశేషంగా అలరించిందని, దీనికి కేవలం 24 గంటల్లోనే 20 లక్షల వ్యూస్ వచ్చాయని ఈ చిత్రబృందం తెలిపింది. 24 గంటల్లో 2 మిలియన్ల వ్యూస్ సాధించిన సినిమాపాట కూడా ఇదేనని కూడా ఆ చిత్రయూనిట్ పేర్కొంది.

ఇంత పెద్ద ఘనత సాధించేందుకు కారణమైన అభిమానులకు సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ ధన్యవాదాలు తెలిపాడు. కాగా, 'అమ్మడు లెట్స్ గో కుమ్ముడు' పాటను ఆలపించింది దేవీశ్రీప్రసాద్, రాణినారెడ్డి. కొణిదెల పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ రోజున (ఈ నెల 25న) ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహించనుండగా, జనవరి 3న ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. 

More Telugu News