modi: కరుణ్! చారిత్ర‌క ఇన్నింగ్స్ ఆడినందుకు శుభాకాంక్ష‌లు: ప్రధాని మోదీ

చెన్న‌య్‌లో ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న‌ చివ‌రి టెస్టు మ్యాచులో త్రిశ‌త‌కం చేసిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ క‌రుణ్ నాయ‌ర్‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు. మ్యాచ్ లో చారిత్ర‌క ఇన్నింగ్స్ ఆడినందుకు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు, క‌రుణ్ నాయ‌ర్ సాధించిన‌ ఈ అద్భుత‌మైన రికార్డు చూసి గ‌ర్విస్తున్నామంటూ ఆయ‌న త‌న ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. క‌రుణ్ నాయర్ సాధించిన రికార్డు ప‌ట్ల టీమిండియా మాజీ క్రికెటర్ల‌తో పాటు ప్ర‌స్తుత క్రికెటర్లు ఆనందం వ్య‌క్తం చేస్తూ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. క‌రుణ్ నాయ‌ర్ త‌ల్లిదండ్రులు కూడా ఎంతో గ‌ర్వంతో త‌మ కుమారుడికి శుభాకాంక్ష‌లు చెబుతూ ట్విట్ట‌ర్‌లో ఓ వీడియో సందేశం పోస్ట్ చేశారు.


More Telugu News