: ప్రస్తుత పరిస్థితుల్లో తమిళ ప్రజలకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చే చిత్రమిది: కోవై సరళ

ప్రస్తుతం తమిళనాడులో టెన్షన్ నెలకొందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చే చిత్రం ‘భలే వెళ్ లైయదేవా’ అని ప్రముఖ హాస్యనటి  కోవై సరళ చెప్పారు. నటుడు, నిర్మాత అయిన శశికుమార్ నిర్మాణంలో దర్శకుడు సోలై ప్రకాశ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘భలే వెళ్ లైయదేవా’ అని, ఈ చిత్రంలో శశికుమార్ కు బామ్మ పాత్రలో తాను నటిస్తున్నానని చెప్పారు. అయితే, ఈ చిత్రంలో నటించేటప్పుడు ఒక విషయమై కొంచెం భయపడ్డానని చెప్పారు. ఆ విషయమేమిటంటే.. శశికుమార్ చాలా మొరటోడని, తానేమో హాస్యనటినని.. తమ కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందా అని మొదట్లో భయపడ్డానని, ఆ తర్వాత తాను పొరపాటు పడ్డానని తెలిసిందని చెప్పారు. శశికుమార్ మితభాషి, చాలా సాఫ్ట్ గా ఉండే వ్యక్తి అని, తన రెమ్యూనరేషన్ ఇంటికి వచ్చి మరీ ఇచ్చేవారని కోవై సరళ ప్రశంసించింది. కాగా, ఈ నెల 23న ఈ చిత్రం విడుదల కానుంది.

More Telugu News