: పెరిగిన పరుగుల వేగం... లీడ్ నుంచి సూపర్ లీడ్ కు దూసుకెళుతున్న ఇండియా

చెన్నైలో ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదవ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు శరవేగంగా లీడ్ ను పెంచుకుంటూ సాగుతోంది. తన టెస్టు కెరీర్ లో తొలి సెంచరీని నమోదు చేసిన కరుణ్ నాయర్, ఆ తరువాత కూడా విజృంభించి ఆడుతూ 150 పరుగుల మైలురాయిని దాటడం, ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ సమయోచిత బ్యాటింగ్, భారత స్కోరును ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 477 పరుగులను దాటించింది.
ఆపై పరుగుల వేగాన్ని భారత ఆటగాళ్లు ఒక్కసారిగా పెంచేశారు. దీంతో టెస్టు మ్యాచ్ వన్డేలా మారిపోయినట్లయింది. 136 ఓవర్ నుంచి ఓవరుకు 5 పరుగుల చొప్పున నాయర్, అశ్విన్ లు సాధిస్తూ ముందుకు సాగారు. ప్రస్తుతం భారత స్కోరు 149 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 524 పరుగులు కాగా, కరుణ్ నాయర్ 153, అశ్విన్ 38 పరుగులతో ఆడుతున్నారు.

More Telugu News