dilsukh nagar attacks: బాంబు పేలుళ్ల కేసు: కోర్టుకు చేరుకున్న దోషులు.. చ‌ర్ల‌ప‌ల్లి జైలు, ప‌రిస‌ర ప్రాంతాల్లో భారీ బందోబ‌స్తు

దిల్‌సుఖ్ న‌గ‌ర్ జంట పేలుళ్ల కేసులో నేర‌స్తులుగా తేలిన ఐదుగురికి ఎన్ఐఏ న్యాయ‌స్థానం మ‌రికాసేప‌ట్లో శిక్ష‌ను ఖ‌రారు చేయ‌నుంది. ఈ ఘ‌ట‌న‌లో దోషులయిన‌ అస‌దుల్లా అక్త‌ర్‌, వ‌కాస్‌, తెహ‌సీన్ అక్త‌ర్‌, యాసిన్ భ‌త్క‌ల్‌, ఐజాజ్ షేక్‌లను చ‌ర్ల‌ప‌ల్లి జైలు సిబ్బంది కోర్టుకు తీసుకువచ్చి, న్యాయ‌మూర్తి ఎదుట హాజ‌రుపరిచారు. ఈ నేప‌థ్యంలో చ‌ర్ల‌ప‌ల్లి జైలు, ప‌రిస‌ర ప్రాంతాల్లో ఈ రోజు భారీగా పోలీసు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. 18 మందిని బ‌లి తీసుకున్న వీరికి కోర్టు విధించే శిక్ష‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెలకొంది.  

More Telugu News