airoplane crashes: సైబీరియాలో కుప్పకూలిన ర‌ష్యా విమానం

సైబీరియాలో ఈ రోజు ఉద‌యం విమాన ప్ర‌మాదం చోటు చేసుకుంది. విమాన‌ సిబ్బంది స‌హా 40 మందితో వెళుతున్న ర‌ష్యా విమానం సైబీరియాలోని బ‌లన్ స్కై  ప్రాంతంలో కుప్ప‌కూలిపోయింది. ర‌ష్యా న‌గ‌రం యెకాటెరింగ్ బ‌ర్గ్ లోని కోల్ట్‌సోవో ఎయిర్‌పోర్టు నుంచి ఈ రోజు ఉద‌యం బ‌య‌లుదేరిన విమానం కుప్ప‌కూలింద‌ని, ప్ర‌యాణికుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ ప్ర‌మాదంలో ఎంత‌మంది మృతి చెందార‌న్న విష‌యంపై అధికారులు ఇంకా వివ‌రాలు తెల‌ప‌లేదు.

More Telugu News