demonitisation: పని ఒత్తిడి త‌ట్టుకోలేక ఉరివేసుకొని ఎస్‌బీఐ క్యాషియర్ ఆత్మహత్య

పని ఒత్తిడి త‌ట్టుకోలేక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఉద్యోగి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డ ఘ‌ట‌న గుజ‌రాత్‌లో చోటు చేసుకుంది. పెద్దనోట్ల రద్దు నేప‌థ్యంలో దేశంలోని అన్ని బ్యాంకుల ముందు ఖాతాదారులు భారీ సంఖ్య‌లో చేరుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌నిపెరిగి, కొంద‌రు బ్యాంకు ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే గుజరాత్‌లోని థారడ్ లో ఎస్‌బీఐ శాఖ‌లో క్యాషియ‌ర్‌గా ప‌నిచేస్తోన్న‌ ప్రేమ్‌ శంకర్‌ ప్రజాపతి అనే వ్యక్తి నిన్న‌ సాయంత్రం ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకొని చనిపోయాడు. ప‌నిలో ఒత్తిడి వ‌ల్లే త‌న భ‌ర్త ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డాడ‌ని ప్రేమ్ శంకర్ భార్య తెలిపింది. కొన్ని రోజుల నుంచి తన భర్త ఇంట్లో ఎవ‌రితోనూ మట్లాడ‌కుండా త‌న‌లో తానే బాధ‌ప‌డిపోతున్నాడ‌ని చెప్పింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ్ శంక‌ర్ స్వ‌స్థ‌లం రాజస్థాన్‌ లోని బార్మర్‌ అనే ప్రాంతం.

More Telugu News