: రికార్డుల మోత మోగిస్తున్న 'శాతకర్ణి'

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో వస్తున్న చారిత్రాత్మక చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' రికార్డుల మోత మోగిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన రెండు రోజుల్లోనే వ్యూస్ పరంగా 3.5 మిలియన్ మార్క్ ను దాటేసింది. ఈ రోజు ఉదయం 9 గంటలకు రికార్డు స్థాయిలో 38,40,660 వ్యూయర్లు 'గౌతమీపుత్ర శాతకర్ణి' ట్రైలర్ ను వీక్షించారు. యూట్యూబ్ ట్రెండింగ్ లో ఈ సినిమా ట్రైలర్ టాప్ పొజిషన్ లో నిలిచింది. ట్రైలర్ విడుదల అయినప్పటి నుంచి టాప్ ప్లేస్ లోనే కొనసాగుతోంది.  


More Telugu News