: రాహుల్ మాట్లాడితే మోదీ బండారం బయటపడుతుంది.. కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడితే ప్రధాని నరేంద్రమోదీ బండారం మొత్తం బయటపడుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. ఈ విషయం ముందే గ్రహించిన బీజేపీ నేతలు రాహుల్‌ను పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంటులో మాట్లాడనీయకుండా చేశారని  విమర్శించారు. ఇందులో రహస్యం ఏమీ లేదని, రాహుల్ అంటే భయపడే బీజేపీ ఎంపీలు ఆయనను సభలో అడ్డుకున్నారని అన్నారు. ఎప్పటికైనా మోదీ బండారం బయటపడక తప్పదని ఆజాద్ హెచ్చరించారు

More Telugu News