: ‘స్పెషల్’ అనే పదం తప్పా, ఆ ప్యాకేజ్ లో ఎటువంటి ప్రత్యేకత లేదు: పవన్ కల్యాణ్

ట్విట్టర్ ద్వారా రోజుకో అంశంపై స్పందిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, తాజాగా, ఏపీకి ‘ప్రత్యేక హోదా’ అంశంపై విమర్శలు గుప్పించారు. ‘ప్రత్యేక ప్యాకేజ్ అనేది కేవలం కంటితుడుపు చర్య. బీజేపీ చెబుతున్న ‘స్పెషల్ ప్యాకేజ్’ లో ‘స్పెషల్’ అనే పదం తప్పా ఎటువంటి ప్రత్యేకత లేదు. ఆంధ్రా ప్రజలను వెన్నుముక లేని వారిగా, లెక్కలేని మనుషులుగా బీజేపీ ప్రభుత్వం ట్రీట్ చేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా పై బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేసిన హామీని నిలబెట్టుకోవాలి. ఆంధ్రా వాళ్లను అవమానపరుస్తూ, బాధకు గురిచేస్తూ, కనీసం రాజధాని కూడా లేకుండా, ఆర్థిక లోటుతో వెళ్లగొట్టారు. ‘జై ఆంధ్ర’ ఉద్యమంలో ప్రాణాలు పోగొట్టుకున్న 400 మందికి పైగా విద్యార్థులపై మేము ప్రమాణం చేసి చెబుతున్నాము... ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన  బీజేపీ, అందుకు సమాధానం చెప్పే వరకు వదిలిపెట్టం’ అని పవన్ కల్యాణ్ తన ట్వీట్ లో హెచ్చరించారు.

More Telugu News